26.6.16

Dasari launched Brahana Movie Audio

 
"దండుపాళ్యం" చిత్రంతో  అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ సంచలనం సృష్టించిన శ్రీనివాస్ రాజు దర్సకత్వంలో..  కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా రూపొంది ఘన విజయం సాధించిన  "శివం" చిత్రం తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. సి.ఆర్.మనోహర్ సమర్పణలో.. విజి చెరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై..  విజయ్.ఎమ్- గుర్రం మహేష్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుంటూరి కేశవులు నాయుడు సహ నిర్మాత. ఉపేంద్ర సరసన సలోని (మర్యాద రామన్న ఫేం), రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ స్వర సారధ్యం వహించారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియోను దర్శక రత్న దాసరి ఆవిష్కరించారు. 

No comments:

Post a Comment