7.7.25

జూలై మాసంలో రెండుసార్లు తిరుమలలో గరుడ వాహన సేవ Garuda Seva




తిరుమలలో జూలై మాసంలో గురు పౌర్ణమి, గరుడ పంచమి పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది.

జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.

No comments:

Post a Comment