శ్రీనివాసమంగాపు
ఇందులో భాగంగా సోమవారం ఉదయం సు ప్రభాతంతో స్వామివారిని మేల్కొ లిపి, తోమాలసేవ, కొలువు, పంచాం గ శ్రవణం, సహస్రనామార్చన నిర్ వహించారు. ఉదయం 11 నుండి 12 గం టల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్ లకు స్నపన తిరుమంజనం నిర్వహించా రు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గం టల వరకు ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం పై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చా రు.
అదేవిధంగా జూలై 01న మంగళవారం హనుమంత వాహనంపై, జూలై 02న బుధవా రం గరుడ వాహనంపై స్వామివారు వి హరించి భక్తులను అనుగ్రహించనున్ నారు.
జూలై 03న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన గురువారం ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్ రవణం, సహస్రనామార్చన, శాత్తుమొ ర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పా ర్వేట మండపానికి వేంచేపు చేస్తా రు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం , వైదిక, సాంస్కృతిక కార్యక్రమా లను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.








No comments:
Post a Comment