15.9.25

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ lok sabha speaker










లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ లు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
వీరు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, అదనపు ఈవో కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్ర పటం అందించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ శాసన సభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ ఎంపీ శ్రీమతి సుధా నారాయణమూర్తి పాల్గొన్నారు.

No comments:

Post a Comment