28.9.25

గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు umbrellas





తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శనివారం తిరుమలకు చేరాయి.

ఈ గొడుగులనుసదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ  టిటిడి చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ లకు అందజేశారు.  వరుసగా 21వ సారి  శ్రీవారికి గొడుగులను సమర్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, శ్రీమతి ప్రశాంతి, శ్రీ కృష్ణ మూర్తి వైద్యనాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment