తిరుమల శ్రీ
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనం తరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కల్యాణ మండపాని కి వేంచేపు చేసి స్నపన తిరుమం జనం నిర్వహిస్తారు. ఇందులో భాగం గా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో వి శేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తా రు. సాయంత్రం సహస్రదీపాలంకార సే వ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్ లో శ్రీమలయప్పస్వామివారు భక్తు లకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
అక్టోబర్ 29న అంకురార్పణ కార ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వ హిస్తారు.

No comments:
Post a Comment