శ్రీనివాసమం
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్ లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్ షాబంధనం, అన్నప్రానాయానం నిర్ వహించారు.
ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్ సవర్లకు స్నపన తిరుమంజనం వేడు కగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొ బ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గం ట వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.
సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిం చనున్నారు. రాత్రి 7 నుండి 8. 30 గంటల వరకు యాగశాల వైదిక కార్ యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్ రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్ రీ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్ టర్ శ్రీ ధనశేఖర్, ఆలయ అర్ చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment