27.10.25

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం subramanyenswara swamy homam






తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ముగిసింది.


ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. 

అక్టోబర్ 27న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం :

హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 27వ తేదీ సోమవారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్. వెంక‌య్య చౌద‌రి దంప‌తులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులో పాల్గొన్నారు.

No comments:

Post a Comment