తిరుచానూరు శ్రీ
ఇందులో ముందుగా విష్వక్సేనారా ధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నై వేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరు గు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు , గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహా కుంభాభిషేకాలను నిర్వహించారు.
ఏడు రకాల మాలలు
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు , పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహి త మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్ మవారికి అలంకరించారు. నెమలి ఈకల మాల, ద్రాక్ష, రోజ్ పె టల్స్, వట్టివేరు, తులసి, రంగు రాళ్లతో కూడిన రోజామాలలు అమ్ మవారికి అలంకరించారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరా జస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గార్డ న్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్ రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 80 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరిం చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







No comments:
Post a Comment