6.12.25

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌





తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు సంద‌ర్భంగా వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై ఈవో భ‌క్తుల‌కు వివ‌రించారు.


డ‌య‌ల్ యువ‌ర్ ఈవో ముఖ్యాంశాలుః


•  నవంబర్ 17 నుండి 25 తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం.


•  వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట


•  డిసెంబర్ 30 నుండి జనవరి 08 తేదీ వరకు 10 రోజుల పాటు వైకుం ద్వార దర్శనాలు.


•  పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.


•   పది రోజులకు గానూ 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు.


•  డిసెంబర్ 30, 31, జనవరి 01  తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ.


•  న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 1 తేది వ‌ర‌కు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు.


•  డిసెంబర్ 02 తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు.


•  మొదటి మూడు రోజులు S.E.D., శ్రీవాణి దర్శనాలు రద్దుమిగిలిన 7 రోజులకుగాను ఈరోజు (5 తేదీ )దయం 10 గం.లకు శ్రీవాణి దర్శనం టికెట్లుమధ్యాహ్నం 3 గం.లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం. (రోజుకు శ్రీవాణి దర్శనం - 1,000, SED - 15,000).


•  జనవరి 02 నుండి 08 తేదీ వరకు VQC - 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం.


•   10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు.


•   10 రోజులలో ప్రత్యేక దర్శనాలు రద్దు.


•  స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం.


•  దాతలకు సంబంధించిన టికెట్లను  రోజు ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం.


•  జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10 తేదీన ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం.


 కార్య‌క్ర‌మంలో టీటీడీ టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌద‌రిసీవీఎస్వో శ్రీ ముర‌ళీ కృష్ణ‌సిఈ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment