15.12.25

ఆలయ ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం Divine Plantation




దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు.  సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు.


 విశిష్ట ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ప్రాచీనఆగమ శాస్త్రాలకు అనుగుణమైన హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచిపరిరక్షించి వినియోగించడమేనని ఆయన తెలియజేశారు.


తిరుమల అభివృద్ధిపై ఏపీ సీఎం దూరదృష్టి


రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా  ప్రాజెక్టు  ఉంటుందనిసంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమని శ్రీ బీ.ఆర్ నాయుడు పేర్కొన్నారు.


ధ్వజస్తంభానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం


ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదుఅది భౌతిక లోకానికిదైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుందిఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచి ఉండే ధ్వజస్తంభం భక్తిపవిత్రతదైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది.


ఆగమశాస్త్రాల ప్రకారంధ్వజస్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి వృక్షాన్ని ఆధ్యాత్మికజ్యోతిష్యవిధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసిసంవత్సరాల తరబడి సంరక్షించిఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారు.


ధ్వజస్తంభాల కోసం ఉపయోగించే పవిత్ర వృక్షాలు


ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకుఏగిశాఇండియన్ కినోటెర్మినేలియాషోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారుఇవి బలంగా,  దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి.


పరిపక్వత చెందిన తర్వాత  వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించిఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారుఅనంతరం దానిని కవచంతో కప్పితిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు.


రాజగోపురంగర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారుసాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే  ధ్వజారోహణం సమస్త లోకాలోన్ని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుంది.


దివ్య వృక్షాల పెంపకంపై టీటీడీ దూరదృష్టి


దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీభవిష్యత్తులో వివిధ రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని దివ్య వృక్షాల ప్రాజెక్టును అత్యంత దూరదృష్టితో ప్రారంభిస్తోంది.


 ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారుభవిష్యత్తులో టీటీడీ నిర్మించనున్న ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాల కోసం పవిత్రమైన కలపను ముందుగానే సిద్ధం చేయడం  ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.


దివ్య వృక్షాల ప్రాజెక్టు వివరాలు


 ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది ప్రాజెక్టు అమలుతోధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుందిదీని ద్వారా ఆగమ శుద్ధిఆధ్యాత్మిక పవిత్రతపర్యావరణ బాధ్యతసంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment