తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామివారు అభయమిచ్చారు.
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ సుబ్రమణ్యస్వామివారు పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు ఉన్నారు.
No comments:
Post a Comment