2.12.25

తిరుమల తరహాలో టిటిడి పరిధి లోని ఇతర ఆలయాలలో రుచికరంగా అన్నప్రసాదాలు పంపిణీ - టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ttd eo






తిరుమల తరహాలో టిటిడి  పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగాశుచికరంగానాణ్యంగా అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.  టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూటిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి న్నప్రసాదాల తయారు  చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలనిఅన్నప్రసాదాల  పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని దేశించారుటిటిడి ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలన్నారుటిటిడిలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి ర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారుదేశవ్యాప్తంగా టిటిడి పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకుఇతర ఆలయాలకు  ఏఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలిఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.


టిటిడి పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్..పిరూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారుపోటు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచికపాచిక పేర్లను మార్చాలని టిటిడి బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి  వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారుటిటిడిలోని అర్భన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్ట పర్చేందుకు వీలుగా తగిన సిబ్బంది  తో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారుశ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా  (క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ) ప్రణాళికలు రూపొందించాలన్నారుతద్వారా  భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.


అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టిటిడి శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాలలో  ఇదివరకే ఉన్న ఆలయం తో పాటు   ఇకపై  నిర్మించనున్న కల్యాణ కట్టఅర్చకులుసిబ్బంది క్వార్టర్స్,  ప్రాకారంగోపురాలుపుష్కరిణితదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.


 సమావేశంలో జేఈవో శ్రీ వివీరబ్రహ్మంసివిఎస్వో శ్రీ కే.వి మురళీకృష్ణఎఫ్..అండ్ సీఏవో శ్రీ  బాలాజీసీఈ శ్రీ టి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.    


No comments:

Post a Comment