టీటీడీ నూతన జేఈఓ (విద్య మరియు వైద్య)గా నియమితులైన డాక్టర్ ఏ.శరత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, బోర్డు సెల్ ఏఈఓ శ్రీమతి సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ నూతన జేఈఓ(H&E)
శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జేఈఓ(H&E) తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ నూతన జేఈఓను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
No comments:
Post a Comment