7.1.26

టిటిడిలో ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేయండి - టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు pending works




టిటిడిలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారుటిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు.


 సందర్భంగా ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు  మాట్లాడుతూఅమరావతి వేంకటపాలెంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీ ఎస్వీ ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  దేవిధంగా టిటిడి కల్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5 వేల భజన మందిరాలనునిర్మాణంలో ఉన్న ఆలయాలనుఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.


ఉపమాకలోని శ్రీ ఎస్వీ ఆలయం,   కరీంనగర్ లోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంఅనంతవరం శ్రీ ఎస్వీ ఆలయంకుప్పంలో నిర్మించనున్న 141 ఆలయాలు,  నవీ ముంబైలోని శ్రీ ఎస్వీ ఆలయంముంబైలోని భాంద్రాకర్నాటకలోని బెల్గావిలోని ఎస్వీ ఆలయంకొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు,  కాణిపాకంలోని పీఏసీ తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.


అదేవిధంగాఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం సమీపంలో లు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడు విగ్రహ ర్పాటు తదితర పనులతో పాటు టిటిడిలో జరుగుతున్న పనులను సకాలంలోజరుగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారుఅలిపిరిలో భక్తుల సౌకర్యార్థం  నిర్మించనున్న బేస్ క్యాంప్ కు డిజైన్ లను తయారు చేయాలన్నారుఅదేవిధంగా తిరుమలతిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్ పనులను గడవులోపు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.


వచ్చే వేసవి సమయానికి భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాం, క్యూలైన్లురహదారులుతాగునీరు తదితర సౌకర్యాలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారునిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు.


 కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జిభానుప్రకాష్ రెడ్డిశ్రీ ఎంశాంతారామ్. శ్రీమతి పనబాక లక్ష్మీశ్రీ స్నరేష్ కుమార్ పాల్గొనగాశ్రీ నన్నపనేని సదాశివరావు వర్చువల్ ద్వారాజేఈవో శ్రీ వివీరబ్రహ్మంఎఫ్ఎ అండ్ ఎస్ఏవో శ్రీ  బాలాజీసీఈ శ్రీ టివి సత్యనారాయణఎస్. శ్రీ మనోహరంపలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment