28.1.26

తెప్పపై శ్రీ పార్థసారథిస్వామివారి కటాక్షం teppotsavam

 







తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణీసత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులను కటాక్షించారు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


రెండ‌వ రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారుఅనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.


అదేవిధంగా బుధవారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు


 సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలుహరికథసంగీత కార్యక్రమాలు నిర్వహించారు.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామిశ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామిలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరిసూపరిండెంట్ శ్రీ శేషగిరిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ,ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment