27.1.26

శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ వ్యాప్తం చేస్తాం : ttd eo







 శ్రీవారి వైభవాన్ని దేశం నలువైపులా వ్యాప్తి చేసేందుకుసుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేని భక్తుల సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు నిర్మించ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.


తొలిసారి వైకుంఠ ఏకాదశికి మొదటి 3 రోజుల పాటు లక్కీ డిప్ విధానంలోమిగిలిన 7 రోజులు సర్వదర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వారదర్శనాల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు ఈవో తెలిపారు.


భారత 77 గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా వనంలో సోమ‌వారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ ప్రసంగించారువారి మాటల్లోనే….


ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ పద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికిఅర్చకులకుశ్రీవారి సేవకులకుఅధికార యంత్రాంగానికిసిబ్బందికి, భద్రతా సిబ్బందికివిశ్రాంత సిబ్బందికిస్కౌట్స్ అండ్  గైడ్స్‌కుభక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.


స్వాతంత్య్రానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాందేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులందరినీ  పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.


1. శ్రీవారి బ్రహ్మోత్సవాలు:


గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాంబ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫల పుష్ప ప్రదర్శనలువిద్యుత్ దీపాలంకరణలుదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 6,976 మంది కళాకారుల కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.


2. వైకుంఠ ఏకాదశి:


-  తొలిసారి వైకుంఠ ఏకాదశికి మొదటి 3 రోజుల పాటు లక్కీ డిప్ విధానంలోమిగిలిన 7 రోజులు సర్వదర్శన క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వారదర్శనాలు కల్పించాంసామాన్య భక్తులకు 90 శాతం సమయాన్ని కేటాయించి ఎప్పుడు లేని విధంగా 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించాం.  


-   విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారుగత అనుభవాల  ష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతానికి  షి చేసిన జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందనలు తెలియజేసున్నా.  


3. రథసప్తమి:


నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించాంఎంతో ఓపికతో వేడుకలను తిలకించిపులకించిన భక్తులకు నా ధన్యవాదాలు.


4. అన్నప్రసాదాలు:


తిరుమలలో 1985లో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి భక్తులకు నిత్య అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభించిందినేడు రోజుకు సరాసరి 2 లక్ష మంది భక్తులకు రుచికరమైననాణ్యమైన అన్నప్రసాదాలు అందిస్తోంది.


అదేవిధంగాఅవసరమైన టీటీడీ స్థానికఅనుబంధ ఆలయాలలో మార్చి నె లోపు భక్తులకు రెండు పూటలా అన్నప్రసాదాలు అందించేందుకు బోర్డు నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాం.


ఇప్పటికే టీటీడీలోని 56 ఆలయాలలో ప్రస్తుతం 17 వేల మందికి దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణ జరుగుతోంది.


5. ఇంజినీరింగ్ పనులు:


భక్తుల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా రూ.25.60 కోట్లతో తిరుమలలో ATGH నుండి అక్టోపస్ వరకు ఔటర్ రింగ్ రోడ్డులో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం.


ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ లో భాగంగా రూ.37 కోట్లతో 100 గదుల నిర్మాణంరూ.16.5 కోట్లతో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.


అదేవిధంగాఇతర ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఇతోధికంగా ఆర్థిక హాయం అందిస్తున్నదిఇందులో కాణిపాకంలో రూ.25 కోట్లతోకొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో రూ.35.19 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం.


6. శ్రీవారి ఆలయాల నిర్మాణం:


టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని SC / ST / BC కాలనీలలో 5 వేల ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.


ఇప్పటికే రూ.750 కోట్లు టీటీడీ బోర్డు కేటాయించిందిఅవసరమై విధివిధానాలు రూపొందించుకొని రాబోవు 3 సంవత్సరాలలో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.


7. ఇతర రాష్ట్రాలలో ఆలయాల నిర్మాణం:


శ్రీవారి వైభవాన్ని దేశం నలువైపులా వ్యాప్తి చేసేందుకుసుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేని భక్తుల సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నది.


అందులో భాగంగా మహారాష్ట్రలోని నవీ ముంబైబాంద్రాకర్ణాటకలోని బెల్గావిఅస్సాంలోని గువాహటిబిహార్‌లోని పాట్నాతమిళనాడులోని

No comments:

Post a Comment