టిటిడి
ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో గురువారం వాలీబాల్, క్యారమ్స్, డాంగ్జీబాల్, షటిల్, టెన్నికాయిట్ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
– టీటీడీ పురుషుల వాలీబాల్ పోటీలలో శ్రీ ఈ. నారాయణ జట్టు విజయం సాధించగా, శ్రీ బి. సుధీర్ కుమార్ రెడ్డి జట్టు రన్నరప్గా నిలిచారు.
– 45 ఏళ్లు లోపు మహిళల క్యారమ్స్ పోటీలలో సర్వశ్రీ పి. దివ్య తేజశ్వి విజయం సాధించగా, సర్వశ్రీ ఎం. విష్ణు ప్రియ రన్నరప్గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీలలో జి. అలేఖ్య కే. సౌజన్య జట్టు విజయం సాధించగా, ఎన్. జానకి, జీ. మనోచిత్ర జట్టు రన్నరప్గా నిలిచారు.
– 45 ఏళ్ల పైబడిన డాంగ్జిబాల్ క్రీడలో కె. ఇందిర విన్నర్ గా, జమున అద్దంకి రన్నర్ గా నిలిచారు.
– డెఫ్ అండ్ డమ్ మహిళ సింగిల్స్ షటిల్ పోటీలో జి. సంపూర్ణమ్మ విన్నర్ గా, బి. నాగలక్ష్మీ రన్నర్ గా నిలిచారు.
– డెఫ్ అండ్ డమ్ పురుషుల సింగిల్స్ షటిల్ పోటీలో సి. సునిల్ కుమార్ విన్నర్ గా, బి. శ్రీకాంత్ రన్నర్ గా నిలిచారు.
– డెఫ్ అండ్ డమ్ డబుల్స్ షటిల్ పోటీలో బి. శ్రీకాంత్, పి. హరిహరప్రసాద్ జట్టు విన్నర్ గా, సి. సునీల్ కుమార్, ఎం. మస్తాన్ రావు జట్టు రన్నర్స్ జట్టుగా నిలిచారు.
- రిటైర్డ్ ఎంప్లాయిస్ పురుషుల సింగిల్స్ షటిల్ పోటీలో ఎస్. సుధాకర్ రావు విన్నర్ గా, డి నాగేశ్వర్ రావు రన్నర్ గా నిలిచారు.
- రిటైర్డ్ ఉమెన్ విభాగంలో టెన్నికాయిట్ సింగిల్స్ పోటీలో బి. లలితమ్మ విన్నర్ గా, డి. భారతి రన్నర్ గా నిలిచారు.
- రిటైర్డ్ ఉమెన్ టెన్నికాయిట్ డబుల్స్ పోటీలో పోటీలో బి. లలితమ్మ, డి. భారతి జట్టు విన్నర్స్ గా, పి. సుమతి, టి. సావిత్రి జట్టు రన్నర్స్ గా నిలిచారు.
No comments:
Post a Comment