13.2.26

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు mohini avataram








శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీ‌నివాసుడు పల్లకీలోతిరుచ్చిపై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు


పల్లకీ ముందు గజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగాకేరళ కళాకారుల వాయిద్యాలుమంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం


 అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందనిఅదంతా తన లీలేనని స్వామి వారు తెలియజేస్తున్నారుతన భక్తులుకానివారు  జగన్మాయకు లోను కాక తప్పదని స్వామివారు  రూపంలో చాటి చెబుతున్నారు.


వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులుసూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ముని కుమార్ధనశేఖర్ఆలయ అర్చకులు విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


గ‌రుడ వాహ‌నం –


రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు కటాక్షించనున్నారు.


గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం


పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందిగరుడవాహనం ద్వారా దాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారుఅంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియచేస్తున్నారు.

No comments:

Post a Comment