30.3.26

మార్చి 30 నుండి నుండి ఏప్రిల్ 01వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు vastotsavam




తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.


ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా  ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీమార్చి 30 తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారుఅనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారుఇక్కడ వసంతోత్సవ భిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.


రెండవరోజు మార్చి 31 శ్రీ భూ మేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు థాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారుఅనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.


చివరిరోజు ఏప్రిల్ 01 శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లుశ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.


 సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్ళుపసుపుచందనంతో అభిషేకం చేస్తారుకాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.


వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే  ఉత్సవానికి ‘వసంతోత్సవమని పేరు ఏర్పడింది క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం  వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.


వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవంఊంజల్‌సేవఆర్జిత బ్రహ్మోత్సవంసహస్రదీపాలంకార సేవలనుమార్చి 31 అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.


No comments:

Post a Comment