16.3.26

అన్నమయ్య సంకీర్తన‌ల‌తో పులకించిన స‌ప్త‌గిరులు annamaiah









పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఆదివారం సాయంత్రం శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో స‌ప్త‌గిరులు పులకించాయి.


 కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46 మఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు.


అన్నమయ్యకువారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారుఅన్నమయ్య విద్యాభ్యాసంవేదశాస్త్రాల అధ్యయనం క్కడే సాగిందని చెప్పారుఅహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్ 32 వేల సంకీర్తనలు రచించారన్నారు.


అనంతరం అహోబిల మఠం తరఫున శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి వస్త్రం సమర్పించారుటీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వామీజీని శాలువాతో సత్కరించి  ప్రసాదాలు అందజేశారు.


 సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ అన్నమాచార్యుల వారి వర్ధంతిని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. 1975లో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుండి దాదాపు మూడు వేల సంకీర్తనలను రికార్డు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు చెప్పారు. అమెరికా దేశంలోని దాదాపు వెయ్యి ఆలయాల్లో అన్నమాచార్యుల సంకీర్తనలను గానం చేస్తున్నారన్నారుఅన్నమాచార్యులు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో సంకీర్తనలు రచించారని తెలిపారుప్రస్తుత ఆధుని సమాజానికి అన్నమయ్య సంకీర్తనలు ఎంతో అవసరం ఉందని తెలియజేశారు.


అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన వివిధ సంకీర్తనలు క్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయిసింగపూర్ మరియు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజన బృందాల సభ్యులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.


చివరగా టీటీడీ తరఫున తాళ్లపాక వంశీయులను అదనపు ఈవో సత్కరించారు.


 కార్య‌క్ర‌మంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్డైరెక్టర్ శ్రీమతి లతఇతర అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment