తిరుమల
శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గౌ|| ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.
ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రివర్యులు వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు.
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనువడు శ్రీ నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44లక్షల ఖర్చును, శ్రీ నారా లోకేష్ విరాళంగా అందించారు.
No comments:
Post a Comment