30.3.26

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం ramapattabhishekam






తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.


ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిమూలవర్లకు అభిషేకం నిర్వహించారుఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారుఅనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారుఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్టచతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.


రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగిందిరాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులుప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న,  టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్‌ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment