16.4.26

మే 01 నుండి 09 వరకు బ్రహ్మోత్సవాలు సమన్వయంతో విజయవంతం చేయాలి : జేఈవో శ్రీ వీరబ్రహ్మం nagulapuram







నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారులను ఆదేశించారుబ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఆలయంలో సమీక్ సమావేశం నిర్వహించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూమే 1 ధ్వజారోహణంతో ప్రారంభమై మే 9 ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారునాగలాపురం పరిసర గ్రామాల్లో  విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.


భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌పుష్పాలంకరణలు చేయాలనిఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లుచలువ పందిళ్లుఫ్లెక్సీలుఆర్చీలు ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలనిఆలయ ప్రాశస్త్యం తెలియజేయడానికి ఎస్వీబీసీలో ప్రోమోలు ప్రసారం చేయాలని సూచించారు.  


ప్రతి రోజు భజనలుకోలాటాలుఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం కౌంటర్లు పెంచాలనిమొబైల్ రుగుదొడ్లుపారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆదేశించారుఅలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులుఅగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారుపార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని తెలిపారు.


అనంతరం జేఈవో ఆలయంపోటుయాగశానాలుగు మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.


 సమావేశంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి నాగరత్నశ్రీ గోవిందరాజన్ఎస్..-3 శ్రీ నరసింహ మూర్తివిజీవో శ్రీ గిరిధర్ఎస్వీ గోశాల డైరెక్టర్ డాఏవిఎన్ శివకుమార్అర్చకులుఇతర అధికారులు పాల్గొన్నారు.


స్థల పురాణం


నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమే శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

పురాణాల ప్రకారం, ‘సోమకాసురుడు’ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాచగాశ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశారు మహత్తర ఘట్టం జరిగిన పవిత్ర ప్రాంతమే నాగలాపురం.


 క్షేత్రంలో మత్స్యరూపంలో ఉన్న శ్రీహరిని మహాలక్ష్మిపరమేశ్వరుడు దర్శించినట్లు విశ్వాసం ఉందిఅందువల్ల  ప్రాంతాన్ని “హరికాంతపురం” అని కూడా పిలుస్తారు.

 ఆలయం పంచప్రాకారాలుసప్తద్వారాలతో అద్భుత శిల్పకళతో నిర్మించబడిందిప్రతి సంవత్సరం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను స్పర్శించే విశేషం ఉందిదీనినే “సూర్యపూజగా ఘనంగా నిర్వహిస్తారు.


No comments:

Post a Comment