టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న ఐటి సంస్థ యజమాని శ్రీ ససపు శ్రీనివాస్ ఈ విరాళాలను అందజేశారు.
ఈ మేరకు డిడిలను టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్రకు శనివారం తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో అందించారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన చీఫ్ ఇంజనీర్ శ్రీ డి. శ్రీనివాస్ రావు, రైల్వే అధికారి శ్రీ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment