20.4.26

శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి SRI BHAGAVAD RAMANUJACHARYA




టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 20 నుంచి 22 తేదీ రకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


 మూడు రోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సాహితీ సదస్సులుభక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయి.


ఏప్రిల్ 20 సాయంత్రం 5.30 గంటలకు తిరుమల పెద్ద జీయర్ స్వామిచిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి.


 అనంతరం “శ్రీ రామానుజాచార్ల వైభవంపై ఉపన్యాసంతరువాత భక్తి సంగీత కార్యక్రమం జరుగుతుంది.


ఏప్రిల్ 21 “శ్రీ రామానుజాచార్లు - తిరుమల కైంకర్యముపై ప్రసంగంతరువాత హరికథ కార్యక్రమం ఉంటుంది.


ఏప్రిల్ 22 “శ్రీ రామానుజాచార్లు - గ్రంథములుపై ఉపన్యాసంఅనంతరం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించబడుతుంది.

No comments:

Post a Comment