2.4.26

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు vasantotsavams







తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ వసంతోత్సవాలు బుధవారం కన్నులపండుగగా ముగిశాయి.


తొలిరోజురెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీ‌దేవిభూదేవి సమే శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారుశ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.


మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామిఅమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెకొబ్బరినీళ్ళుపసుపుచందనంతో అభిషేకం చేశారుఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు.


అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామిపేష్కార్ శ్రీ రామ కృష్ణఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment