నారాయణవనంలోని
శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించి వైభవంగా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
మే 28న ధ్వజారోహణం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మిథున లగ్నంలో ఉదయం 7.30 గంటల నుండి 9.00 గంటల వరకు ధ్వజారోహణ మహోత్సవం ఆగమోక్తంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాలను రంగవల్లులతో సుందరంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment