శ్రీ
వేంకటేశ్
వరస్వామికి
అపర
భక్తురాలైన
మాతృ
శ్రీ
తరిగొండ
వెంగమాంబ
296వ
జయం
తి
ఉత్సవం
తిరుమలలోని
నారాయణగి
రి
ఉద్యానవనంలో
ఉన్న
పద్మావతి
ప
రిణయ
మండపంలో
గురువారం
సాయంత్రం
అత్యంత
వైభవంగా
జరిగింది
.
ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు.
ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అనే అద్భుతాన్ని మనం చూస్తున్నామని, సజీవ సమాధి అనేది శరీరం ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే అత్యున్నత యోగస్థితి అని తెలిపారు. మరణం, చీకటి వంటి భయాలను భగవన్నామస్మరణతో అధిగమించవచ్చని, ''ఓం నమో వెంకటేశాయ'' అనే అష్టాక్షరీ మంత్రమే మోక్షానికి మార్గమని పేర్కొన్నారు. తిరుమల వంటి దివ్య క్షేత్రానికి రావడం తన పూర్వ జన్మ పుణ్యఫలమని, భగవన్నామస్మరణ ద్వారానే భక్తులు పరిపూర్ణ ఆనందాన్ని పొందగలరని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి సువర్ణమ్మ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో గురువారం సాయంత్రం టీటీడీ అధికారులు, వెంగమాంబ వంశీకులు పుష్పాంజలి ఘటించారు.
No comments:
Post a Comment