1.5.26

పదో తరగతి పరీక్షల్లో టీటీడీ విద్యా సంస్థల అత్యుత్తమ ఫలితాలు ttd schools


తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న 9 ఉన్నత పాఠశాలలు గురువారం వెలువడిన పదవతరగతి పరీక్షల ఫలితాల్లో  అత్యుత్తమ  స్థానం సాధించాయి.


ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులుఇందుకోసం కృషి చేసిన ప్రధానోపాధ్యాయులుఉపాధ్యాయులను టిటిడి ఈవో శ్రీ ఎంరవిచంద్రజేఈవో డా..శ‌ర‌త్‌డిఈవో శ్రీ వెంక‌ట సునీలు అభినందించారు.


ఏపీలోని టీటీడీకి చెందిన తొమ్మిది ఉన్నత పాఠశాలల నుండి 558 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారుఇందులో 524 మంది ఉత్తీర్ణులయ్యారుమొత్తంగా 94 శాతం ఫలితాలు సాధించడం జరిగింది.


ఇందులో ఎస్వీ ఉన్నత పాఠశాలలకు చెందిన కె.ఆమ‌నిఎస్‌.పి.బాలిక‌ల ఉన్నత పాఠశాలలకు చెందిన ఎస్‌.గీతికా రెడ్డి 587 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు.


ఎస్జీఎస్ హైస్కూల్ కు చెందిన ద‌త్త‌సాయి చ‌రిష్మ‌ 584 మార్కులుఎస్‌కెఆర్ ఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూలు కు చెందిన కె.యోగేష్ 580 మార్కులు సాధించి  పాఠశాలల్లో టాపర్లుగా నిలిచారు.


తాటితోపు ఉన్నత పాఠశాల విద్యార్థి పి.జ‌న‌ని 562 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారు.


ఓరియంటల్ హైస్కూలు కు చెందిన ఎం.నాగ‌చైత‌న్య‌ 554 మార్కులుతిరుమల ఎస్వీ హైస్కూలు కు చెందిన కె.వెంక‌ట‌క్రిష్ణ‌ 559 మార్కులతో ఆయా పాఠశాలల టాపర్ లు గా నిలిచారు.


భీమ‌వ‌రం ఎస్వీ డెఫ్ ప్రత్యేక హైస్కూలు కు చెందిన బి.చైత‌న్య‌ కు 400 మార్కులకు 375 మార్కులుతిరుప‌తి ఎస్వీ డెఫ్ ప్రత్యేక హైస్కూలు కు చెందిన .శ్రావ్య‌శ్రీ 400 మార్కులకు 373 మార్కులు సాధించి పాఠశాలల‌ టాపర్ గా నిలిచారు రెండు పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.


టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్రజేఈవో డా..శ‌ర‌త్‌  నేతృత్వంలో డిఈవో శ్రీ వెంక‌ట సునీలు స్వీయ ర్యవేక్షణలో అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారుచదువులో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదివించడంతో  ఫలితాలు సాధ్యం అయ్యాయిఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులుఉపాధ్యాయుల సమిష్టి కృషితో   ఫలితాల సాధనకు దోహదం చేసింది.


No comments:

Post a Comment