10.5.26

భక్తి పరవశంలో వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు vassantotsavams




శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి లయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన  వసంతోత్సవాలు శనివారం భక్తిజనసంద్రంలో ఘనంగా ముగిశాయివేదఘోషాలుమంగళవాయిద్యాలుగోవిందనామస్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.

ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభా సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగ శ్రవణంసహస్రనామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.


అనంతరం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిశ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామిరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపంలో వేంచేపు చేసి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.


మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు జరిగిన స్నపన తిరుమంజనం క్తులను మంత్రముగ్ధులను చేసిందివిష్వక్సేనారాధనపుణ్యాహవచనంరాజోపచారాల అనంతరం పాలుపెరుగుతేనెకొబ్బరినీరుపసుపుగంధంతో స్వామిఅమ్మవార్లకు మహాభిషేకం నిర్వహించారుచక్రధారశంఖధారసహస్రధారమహాకలశాభిషేకాలను వైఖానస ఆగమరీతిలో అర్చకులు ఘనంగా చేపట్టారు.


 సందర్భంగా పురుషసూక్తంశ్రీసూక్తంభూసూక్తంనీలాసూక్తంవిష్ణుసూక్తం తదితర వేదమంత్రాలు మారుమోగగా ఆలయ ప్రాంగణం దివ్యానుభూతిని కలిగించిందిఏడు రకాల సుగంధ పుష్పమాలలతో స్వామిఅమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామిఅమ్మవార్లు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీసూపరింటెండెంట్ శ్రీ రమేష్ బాబుటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్శ్రీ ధనశేఖర్ర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment