ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివృత్తికి, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సీతారామలక్ష్మణులకువైభవంగాస్నపనతిరుమంజనం
పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు చేపట్టారు.
బంగారుతిరుచ్చిపైసీతారామలక్ష్మణులమంగళవిహారం
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మంగళ విహారాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో తిలకించారు.
రాత్రిపవిత్రప్రతిష్ఠ, శయనాధివాసం
ఆగస్టు 9నపవిత్రసమర్పణ
ఆగస్టు 9న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ బాబు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment