22.2.26

ఫిబ్ర‌వ‌రి 23 నుండి 26వ తేదీ వ‌ర‌కు బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో బాలాల‌యం balalayam





చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 23 నుండి 26 తేదీ వ‌ర‌కు ''బాలాలయం'' కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుందిఇందుకోసం ఫిబ్ర‌వ‌రి 23 ఉద‌యం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వ‌ర‌ణంసాయంత్రం అంకురార్పణశాంతి  హోమంక‌ళాక‌ర్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.


సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ''బాలాలయం'' చేపడతారుఇందుకోసం ఆలయంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు.


ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 24 ఉద‌యం అక‌ల్మ‌ష హోమంవాస్తు పూజ‌వాస్తు హోమం,  సాయంత్రం మ‌హా శాంతి హోమాలువైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.


ఫిబ్ర‌వ‌రి 25 ఉద‌యం బాలాల‌య స్థాప‌నారాధ‌న‌చ‌తుర్థ‌శ క‌ళ‌శారాధ‌న‌పంచ‌గ‌వ్యాధివాసంసాయంత్రం మ‌హాశాంతి అభిషేకంవైదిక కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.


ఫిబ్ర‌వ‌రి 26 ఉద‌యం 7.30 గంట‌ల‌కు యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలుపూర్ణాహుతికుంభ ప్ర‌ద‌క్ష‌ణబాలాల‌య సంప్రోక్ష‌ణంధ్రువ క‌ల్యాణం చేప‌డ‌తారు.

No comments:

Post a Comment