టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
• టీటీడీ అధికారుల విభాగంలో ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి జట్టు విజేతగా నిలిచింది. డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకుమార్ జట్టు రన్నరప్ గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో శ్రీమతి శోభారాణి జట్టు విజయం సాధించగా శ్రీమతి స్వప్న మంజరి జట్టు రన్నరప్గా నిలిచింది.
– 45 ఏళ్ల లోపు మహిళల విభాగంలో శ్రీమతి మనీష జట్టు విజయం సాధించగా శ్రీమతి మనోజ జట్టు రన్నరప్గా నిలిచింది.
– 45 ఏళ్లు పైబడిన పురుషుల విభాగంలో శ్రీ శ్రీనివాసులు జట్టు విజయం సాధించగా, శ్రీ శ్రీధర్ బాబు జట్టు రన్నరప్గా నిలిచింది.
– 45 ఏళ్ల లోపు పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీ కోదండ చెట్టి జట్టు విజయం సాధించగా, శ్రీ నాథముని జట్టు రన్నరప్గా నిలిచింది.
No comments:
Post a Comment