28.3.26

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం - హనుమంతునిపై శ్రీ వేంకటాద్రిరాముడు hanumad vahanam






తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.


హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి


హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడురామాయణంలో మారుతి స్థానం అద్వితీయంచతుర్వేద నిష్ణాతుడుగానవవ్యాకరణ పండితుడుగాలంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసిందిగురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన హనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో  ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.


శ్రీరామనవమి ఆస్థానం


అనంతరం రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.


 కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment