31.3.26

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం teppotsavams






తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు సోమ‌వారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి.


విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామిఅమ్మవారు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను కటాక్షించనున్నారువిశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు.


ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి త్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెచందనంకొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.


శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారురాత్రి 7 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారువిద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ఇతర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment