25.4.26

ఏప్రిల్ 29, 30వ తేదీల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు tarigonda vengamamba




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296 జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 29, 30 తేదీల్లో వైభవంగా జరుగనున్నాయివెంగమాంబ స్వస్థలమైన తరిగొండతిరుమలతిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.


తరిగొండలో..


తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 30 తేదీ ఉదయం 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనంఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు.


సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానంహరికథ కార్యక్రమాలు రుగనున్నాయి.


తిరుపతిలో..


ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల‌లో ఉదయం 10 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జరుగనుందిఇందులో ప్రముఖ పండితులు పాల్గొని వెంగమాం రచనలపై ఉపన్యసిస్తారుసాయంత్రం 6 గంటలకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో గాత్ర సంగీ సభహ‌రిక‌థ గానం చేయ‌నున్నారు.


ఏప్రిల్ 30 తేదీన ఉద‌యం 9 గంటలకు తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్దగల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.


తిరుమలలో..


ఏప్రిల్ 30 తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారుసాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపంనకు ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారుసాయంత్రం 6 నుండి 7.15 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మ‌రియు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులువిద్యార్థుల‌చే తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారురాత్రి 7.15 గంటలకు పుష్ప‌గిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంక‌ర భార‌తీస్వామి అనుగ్రహభాషణం చేయనున్నారు.

No comments:

Post a Comment