తిరుమలలో ఇంధన కొరత లేదని భక్తులకు టీటీడీ స్పష్టం చేయడం జరుగుతోంది.
ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హెచ్.పి, మరియు ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోవడంతో మధ్యాహ్నం సదరు బంకుల్లో నో స్టాక్ బోర్డులను పెట్టడం జరిగింది.
సాయంత్రానికి హెచ్.పి.పెట్రోల్ బంక్ కు ట్యాంకర్ చేరుకోవడంతో ఇంధనం అందుబాటులోకి వచ్చింది. రేపు ఉదయానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కు కూడా ట్యాంకర్ చేరుకుంటుందని తెలియజేయడమైనది.
అదేవిధంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీలర్లను కోరడం జరిగింది.
No comments:
Post a Comment