8.4.26

తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు ttd addl eo









తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం తనిఖీలు నిర్వహించారు.


 సందర్భంగా రామ్ భగీచా బస్టాండ్ కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.


అనంతరం ఆకాశగంగ వద్దకు చేరుకున్ అదనపు ఈవో దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు‌.


అనంతరం శ్రీవారి సేవా సదన్ పక్కన ఉన్న లేబర్ షెడ్లను కూడా తనిఖీ చేశారు.


అనంతరం తిరుమలలోని ఏటీసీ వద్దకు చేరుకున్న ఆయన రెవెన్యూ విభాగానికి కాటేజీ కేటాయింపుపై స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


 తనిఖీల్లో తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లువీజీవో శ్రీ సురేంద్రఈఈలు శ్రీ శ్రీనివాసరావుశ్రీ వేణు గోపాల్డీ శ్రీ చంద్ర శేఖర్ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment