18.2.26

శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అదనపు ఈవో ttd addl eo







శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన అదనపు ఈవో కు  శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో శ్రీ టిబాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ కుంభ స్వాగతం పలికారువస్త్రాల సమర్పణల అనంతరం ఆయన వాయులింగేశ్వరుడుజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారుశ్రీ దక్షిణాది మూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.


పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా – శ్రీ సిహెచ్వెంకయ్య చౌదరి


దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందని ఆయన తెలిపారుశ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య కూడా విశేషంగా పెరగుతోందన్నారుతిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేస్తున్న భ‌క్తులు ప‌రిస‌ర ప్రాంత ఆల‌యాల సంద‌ర్శ‌న‌లో భాగంగా శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాన్ని కూడా భక్తులు ద‌ర్శించుకుంటున్నారని తెలిపారు.


దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి రాహుకేతు పూజలను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారుశ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి ప్రసిద్ధి చెందిందన్నారుశ్రీవారి చెల్లెలు భ్రమరాంబచెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీవేంకటేశ్వరుడు పట్టువస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామిఅమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారుశ్రీ కాళహస్తీశ్వరుడికి గత 26 సంవత్సరాలుగా టిటిడి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాననిఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.


 కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment