Featured Post

Donation of ₹10 Lakhs to TTD

A devotee from Bengaluru Sri G. Vijay Hemanth has donated Rs.10,00,104 to the Tirumala TTD Sri Venkateswara Annaprasadam Trust. The donor ha...

10.4.26

Donation of ₹10 Lakhs to TTD




A devotee from Bengaluru Sri G. Vijay Hemanth has donated Rs.10,00,104 to the Tirumala TTD Sri Venkateswara Annaprasadam Trust.


The donor handed over the DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

వైభవంగా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 24 నుండి మే 03 వరకు ఆధ్యాత్మిక వేడుకలు




చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 24 నుండి మే 03 తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.


ఉత్సవాల ప్రారంభానికి ముందు ఏప్రిల్ 21 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంఏప్రిల్ 23 సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవంఅంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.


ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకురాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహనసేవలు భక్తులను అలరించనున్నాయి.


వాహనసేవల వివరాలు:


ఏప్రిల్ 24

ఉదయం – ధ్వజారోహణం (మిథున లగ్నంలో . 9.05 నుండి 9.15 వరకు)

సాయంత్రం – శేష వాహనం


ఏప్రిల్ 25

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హంస వాహనం


ఏప్రిల్ 26

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం


ఏప్రిల్ 27

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం


ఏప్రిల్ 28

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవంగరుడ వాహనం


ఏప్రిల్ 29

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవంగజ వాహనం


ఏప్రిల్ 30

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం


మే 01

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వ వాహనం


మే 02

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం


కల్యాణోత్సవం :


ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారురూ.500/- చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చుపాల్గొనే వారికి ఉత్తరీయంరవికెఅన్నప్రసాదం అందజేస్తారు.


మే 03 సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.


ఆధ్యాత్మిక కార్యక్రమాలు:


 బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుఅన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీతఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయిభక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.