Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

8.5.26

మే 10, 11 తేదీలలో టిటిడి ఇంజినీరింగ్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు


టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో వివిధ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి 2026 మే 10, 11 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 93 పరీక్షా కేంద్రాలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలు జరుగనున్నాయి.


సంబంధిత పోస్ట్ లకు సంబంధించి కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయిఏఈఈ (సివిల్) - 93 కేంద్రాలుఏఈఈ (ఎలక్ట్రికల్)- 16 కేంద్రాలుఏఈ (సివిల్)- 42 కేంద్రాలుఏటీవో (సివిల్) - 42 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి


పోస్టుల భర్తీకి క్రింది షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి.


పరీక్షల షెడ్యూల్


AEE (సివిల్) – 10.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు


AEE (ఎలక్ట్రికల్) – 10.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు


AE (సివిల్) – 11.05.2026 – ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు


ATO (సివిల్) – 11.05.2026 – మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు


అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం రెండు గంటల ముందుగానే చేరుకోవాలని టిటిడి సూచించిందినిర్దేశిత సమయానికి అనంతరం వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరు.


అలాగే పరీక్షా కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలురిస్ట్ వాచ్‌లు తదితర వస్తువులను అనుమతించరుహాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలుసూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.


ANNAMAYYA’S SAYINGS ARE SPIRITUAL GUIDES FOR LIFE: DR. HEMANTH KUMAR







Literary seminars held at Annamacharya Kalamandiram in Tirupati as part of the 618th birth anniversary celebrations of saint poet Annamacharya concluded on Thursday in a devotional atmosphere.


Dr. Hemanth Kumar said Annamayya’s compositions spread devotion, morality, and human values while guiding people towards righteous living.


Speakers highlighted the spiritual greatness of Annamayya’s sankirtanas and their role in spreading devotion and Vedic philosophy among common people.


Music and dance programmes were also organised in the evening.

గోవింద నామస్మరణల మధ్య ప్రారంభమైన శ్రీనివాసమంగాపురం వసంతోత్సవాలు మే 08న కనులపండువగా స్వర్ణ రథోత్సవం srinivasa mangapuram




సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయిగోవింద నామస్మరణలతోమంగళవాయిద్యాల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.


వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించిన పుష్పాలుఫలములను స్వామివారికి సమర్పించి కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుని అనుగ్రహం పొందడమే  వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారుభక్తుల హృదయాలలో భక్తిప్రశాంతతఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపే  ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయని పేర్కొన్నారు.


వైఖానస మాసంలోని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే  మూడు రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారుఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేయగాగోవిం నామాలతో ఆలయ వీధులు మారుమోగాయి.


మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారుపాలుపెరుగుతేనెచందనంపుష్పాలతో నిర్వహించిన అభిషేక సేవ క్తులను పరవశింపజేసిందిఅనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారుసాయంత్రం తిరువీధుల ఉత్సవంలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించనున్నారు.


వసంతోత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించే ఆర్జిత సేవలైన నిత్య కల్యాణోత్సవం, అలాగే మే 07 తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసిందిఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ప్రత్యే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.


మే 08 స్వర్ణ రథోత్సవం


వసంతోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే స్వర్ణ రథోత్సవం మే 08 తేదీ శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు జరగనుందిబంగారు తేజస్సుతో అలంకరించిన స్వర్ణ రథంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనం ఇవ్వనున్నారు మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.


 కార్యక్రమంలో టిటిడి ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి రలక్ష్మీసూపరింటెండెంట్ శ్రీ రమేశ్ఆలయ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్శ్రీ ధనశేఖర్లయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులుపలువురు అర్చకులువిశే సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SRI VEDANARAYANA SWAMY ON SURYAPRABHA VAHANAM



As part of the annual Brahmotsavams at Sri Vedanarayana Swamy Temple, Sri Vedanarayana Swamy blessed devotees on Surya Prabha Vahanam on Thursday morning.


 The procession was held grandly through the four Mada streets amid Govinda chants and devotional fervour.


Snapana Tirumanjanam was also performed to the utsava deities with milk, curd, honey, turmeric and sandal paste. Chandraprabha Vahanam will be held at 7.30 pm.


On May 8, the grand Rathotsavam will take place at 6.25 am, followed by Kalyanotsavam from 4.30 pm to 6.30 pm. Ashwa Vahanam will be held at 7.30 pm.

సూర్యప్రభ వాహనంపై తేజోవంతంగా శ్రీ వేదనారాయణ స్వామి మే 8న వైభవంగా రథోత్సవం, కల్యాణోత్సవం radhotsavam


నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయ వార్షి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారుఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవ ఆలయ నాలుగు మాడ వీధుల్లో అత్యంత వైభవంగా సాగిందిగోవింద నామస్మరణల ధ్య భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి నుగ్రహం పొందారు.


సకల లోకాలకు తేజస్సును ప్రసాదించే సూర్యభగవానుని ప్రతీకగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిందిసకల జీవరాశులకు ప్రాణాధారమైన సూర్యుని మహిమను ప్రతిబింబించేలా  వాహనసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.


అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారుపాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనంతో అభిషేకాలు నిర్వహించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.


రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డిటెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులుశ్రీ చెంగల్రాయులులయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


మే 8 రథోత్సవంకల్యాణోత్సవం


బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 6.25 గంటలకు శ్రీ వేదనారాయణస్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగనుందిమహారథంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.


అదేవిధంగా సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారి ల్యాణోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించనున్నారురాత్రి 7.30 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.