టీటీడీ శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.20 లక్షలు విరాళం అందింది. వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన శ్రీ మస్తాన్ రావు ఈ విరాళం అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 617వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి . ఈ సందర్బంగా అన్నమాచార్య కళామందిరంలో సంగీత సభ, హరికథ జరిగింది.
తిరుపతికి చెందిన శ్రీ కె.ఉదయభాస్కర్ బృందం ఉదయం 9 గం.లకు సంగీత సభలో "అప్పని వరప్రసాది అన్నమయ్య", "అదివో అల్లదివో శ్రీహరి వాసము" కీర్తనలను ఆలపించారు. ఉ.10.30లకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత హరికథా భాగవతారిణి శ్రీమతి జంధ్యాల కృష్ణ కుమారి బృందం "తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత కథ"ను హరికథగా చెప్పారు.
అంతకుముందు ఉదయం 8:00 గంటలకు శ్రీ కోదండ రామస్వామి వారి ఆస్థానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టి గానం నిర్వహించారు.
సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు శ్రీమతి.కె.వి.విశాలక్ష్మీ బృందం సంగీత సభ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు శ్రీమతి జి.ఎన్.కె.సీతాలక్ష్మీ బృందం హరికథ గానం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ సి.లత, అసిస్టెంట్ లు శ్రీ పి.కృష్ణమూర్తి, శ్రీమతి కోకిల, భక్తులు పాల్గొన్నారు.
The 617th birth anniversary celebrations of Saint Tallapaka Annamacharya concluded grandly on Sunday. At the Annamacharya Kalamandiram, a music concert and Harikatha were held.
At 9 AM, Sri K. Udayabhaskar and team from Tirupati presented Annamayya keertanas like “Appani Varaprasadi Annamayya” and “Adivo Alladivo Srihari Vasamu.” At 10.30 AM, retired Harikatha artist Smt. Jandhyala Krishna Kumari and her team narrated “The Life Story of Annamacharya” through Harikatha.
Earlier, at 8 AM, a grand Asthanam was held at Sri Kodanda Ramaswamy Temple, accompanied by a group rendition by Annamacharya Project artists.
In the evening, at 6 PM, a music concert was performed by Smt. K.V. Vishalakshmi and team, followed by Harikatha by Smt. G.N.K. Seethalakshmi and her group at 7 PM.
Annamacharya Project Coordinator Dr. C. Latha, assistants Sri P. Krishnamurthy, Smt. Kokila, and several devotees participated in the event.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేపట్టారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ దామోదరం, ఏఈవో శ్రీ ఎం. గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ వి.రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ డి.మునికుమార్, ఎం ధోనీ శేఖర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
On the second day of three day annual Vasanthotsavam at Srinivasa Mangapuram, Sri Kalyana Venkateswara Swami along with Sridevi and Bhudevi took out a celestial ride on Swarna Ratham on Sunday evening to bless His devotees.
The annual spring festival was held with grandeur, with Snapana Tirumanjanam in the afternoon to the utsava deities.
Temple Special Grade Deputy EO Smt. P. Varalakshmi, EE Sri Jaganmohan Reddy, DyEO Sri Damodaram, AEO Sri M. Gopinath, Superintendent Sri V. Ramesh Babu,and a large number of devotees participated in this program.
టీటీడీ శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.20 లక్షలు విరాళం అందింది. వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన శ్రీ మస్తాన్ రావు ఈ విరాళం అందించారు. ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్సేవ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వసంతోత్సవాలు 19వ తేదీ వరకు జరుగనున్నాయి.
మే18న స్వర్ణరథోత్సవం
మే 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో నిత్యకల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ ముని రాజా, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని కుమార్, ఆలయ అర్చకులు , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The annual Vasanthotsavam celebrations of Sri Kalyana Venkateswara Swamy commenced grandly on Saturday at Srinivasa Mangapuram. The Vasanthotsavams will continue until May 19.
On Sunday, the procession of Swarna Ratham will take place from 6 PM to 7 PM.
Due to Vasanthotsavams, the regular Nitya Kalyanotsavam has been cancelled by TTD.
Spl Gr. Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Muni Raja, Temple Inspector Sri Muni Kumar, temple priests, and a large number of devotees participated in the event.
శ్రీవాణి ట్రస్ట్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునః సమీక్షించుకుని మరింత మెరుగ్గా, సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా తయారు చేయాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఆలయాల నిర్మాణాలు పునాదుల్లాంటివని ఆయన మాట్లాడారు. ఆలయాల నిర్మాణాలతో దైవచింతన, ఆధ్యాత్మికత, సేవా భావం సమభావంతో మానవ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే సమరసత సేవా పౌండేషన్, దేవాదాయ శాఖ సౌజన్యంతో నిర్మితమవుతున్న ఆలయాల ప్రస్తుత స్థితి, జీర్ణాద్ధరణ పనులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తి అయిన ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టిటిడి తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల నిర్వహణకు పక్కాగా ప్రణాళికలు, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
TTD Executive Officer Sri J. Syamala Rao instructed the officials concerned to review the existing guidelines of the SRIVANI Trust and make them more efficient, user-friendly, and transparent.
He held a review meeting with officials on Saturday at his chamber in the TTD Administrative Building.
On this occasion, the EO stated that the construction of temples plays a pivotal role in spreading Sanatana Dharma among the public. He emphasized that such temple projects foster divine contemplation, spirituality, and service-mindedness, which in turn strengthen human values and relationships.
He directed officials to prepare a detailed report on the current status of temple construction and renovation works being carried out with the support of Samarasata Seva Foundation and the Endowments Department. He also instructed that an action plan be drafted for providing Dhoopa, Deepa, Naivedyam and ongoing maintenance for the completed temples.
Furthermore, the EO suggested regular inspections by TTD during and after the completion of temple constructions. For neglected temples, he stressed the need for a clear plan to ensure proper rituals and services.
The EO also recommended establishing a dedicated mechanism for managing temples built in under developed areas.
Additional EO Sri Ch. Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, Chief Engineer Sri Satyanarayana, and FACAO Sri Balaji were present in the meeting.
శ్రీమాన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తనలలో ఉపనిషత్తులు, పురాణాల సారాన్ని సహజ కవితా దృష్టి కనిపిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య వెల్లడించారు. తాళ్లపాక అన్నమాచార్యులు వారి 617వ జయంతి సందర్భంగా అన్నమాచార్య కళా మందిరంలో శనివారం సాహితీ సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా అన్నమయ్య పదము - వెంగమాంబ పద్యము అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఉపనిషత్తులు, పురాణాల సారాన్ని శ్రీవేంకటేశ్వరుడుకి అన్వయించి స్వామి వారి మహిమలను భక్త లోకానికి కవితా రూపంలో అందించారన్నారు. వేంకటేశ్వరస్వామి మహత్యాన్ని కావ్యంగా వెంగమాంబ మలిచారన్నారు. వరాహ పురాణం, భవిష్యోత్తర, పద్మపురాణం, వేంకటేశ్వరస్వామి కథలను కావ్యంగా అభివర్ణించారన్నారు. ఇద్దరూ వేంకటేశ్వరస్వామి మహత్యాన్ని సరళంగా భక్తలోకానికి అందించారన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య కవిత్వంలో జీవుడు అనే అంశంపై ఆచార్య తాడేపల్లి పతంజలి మాట్లాడారు. అన్నమయ్య రాసిన సంకీర్తనలలో 600 కీర్తనలలో జీవుడి వర్ణన కనపడుతుందన్నారు. జీవాత్మకు ప్రతినిధిగా వేంకటేశ్వరస్వామి వారిని అభివర్ణించారన్నారు. పరమాత్మకు సంబంధించిన వారే జీవుడు, ఎప్పుడూ పరమాత్మను వీడకుండా కొలవాలని అంతర్గతంగా సందేశం ఇచ్చారన్నారు.
ఈ సందర్భంగా తాళ్లపాక వాజ్మయం - విరాట స్వరూపం అనే అంశంపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ గంధం బసవ శంకరరావు ప్రసంగించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సారస్వత సేవను దాదాపు 200 సంవత్సరాలకు పైగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులు, వారసులు చేశారన్నారు. ఈతరం పరిశోధకులు మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని కోరారు.
సాయంత్రం 6 గం.లకు తిరుపతికి చెందిన డా. ఎం.పి.ఎస్.మాధురి బృందం సంగీత సభ, నెల్లూరుకు చెందిన శ్రీ టి.రమణయ్య బృందం హరికథ జరుగనుంది.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ - 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు గుంటూరు ఆద్వర్యంలో శనివారం శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నందు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్ , వ్యాసరచన పోటీలకు తిరుపతి జిల్లాలోని పలు జడ్పీ హైస్కూల్, ఎస్పీ డబ్ల్యూ డి ఫార్మశీ విద్యార్థినీలు పాల్గొన్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలలో కె. తేజస్విని ప్రథమ స్థానం పొందగా, పి. మాయ ద్వితీయ స్థానం, బి. మహేశ్వరికి, జడ్పీ హైస్కూల్ పుదుపేట కు చెందిన జే.డి. గుణసుందరి మూడో ప్రైజ్ పొందారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని కె. తేజస్విని ఎంపికైంది. వ్యాసరచన పోటీలలో మొదటి ఫైజ్ జడ్పీ హైస్కూల్ పుదుపేటకు చెందిన ఎస్ జీ లతిక, రెండోవ స్థానం జడ్పీ హైస్కూల్ కరకంబాటికి చెందిన పి. లహరి, మూడో ప్రైజ్ ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన జె. తేజస్విని, బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన కె. వర్షిత పొందారు. గెలుపొందిన విద్యార్థినీలకు టిటిడి బోర్డు ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామలరావు, డిఈవో శ్రీ వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా. ఎం. పద్మావతమ్మ, రాష్ట్ర సమన్వయ కర్త శ్రీ పి. నీలకంఠయ్య అభినందనలు తెలిపారు.