శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ Pavitra Samarpanam
తిరుమల శ్రీవా
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమా లు తదితర వైదిక కార్యక్రమాలు చే పట్టారు. ఆ తరువాత సంపంగి ప్రా కారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పె రుగు, తేనె, చందనం, పసుపు తది తర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘో ష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు , వరదరాజస్వామివారికి, వకు ళమాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనులవారికి, యోగనరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూ వరాహస్వామివారికి, శ్రీ బేడి ఆం జనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్ వామివారు ఆలయ నాలుగు మాడ వీధు ల్లో విహరించి భక్తులకు దర్ శనమిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కా ర్యక్రమాలు జరుగనున్నాయి.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారా లున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్ వామివారి ఉత్సవమూర్తులకు కావలసి న పవిత్రాలు చేయడానికిగాను శ్రే ష్టమైన జాతి పత్తి మొక్కలను అత్ యంత పవిత్రమైన దైవమొక్కగా భావిం చే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తా రు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులు అద్దకం చేస్తారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్ రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొ న్నారు.













.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)