హైదరాబాద్ కు చెందిన శ్రీ పొరూరి అనంత ఈశ్వర్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సోమవారం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.