24.4.26

దోష నివారణకు దివ్య పుష్పయాగం pushpa yagam










తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారుభక్తి పరవశంలో భక్తులు  దివ్యోత్సవాన్ని దర్శించారు.


ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ  కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారుపాలుపెరుగుతేనెపసుపుచందనంకొబ్బరినీళ్లతో అభిషేకాలు చేశారు.


సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల్ మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలుమంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా జరిగిందితులసి, చామంతిమల్లెగన్నేరుకనకాంబరాలురోజాతామరకలువ తదితర 12 రకాల పుష్పాలుఆరు రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి యాగం నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్తమిళనాడుకర్ణాటక రాష్ట్రాల భక్తులు  పుష్పాలను భక్తి భావంతో విరాళంగా సమర్పించారుపుష్పాల సుగంధంతో ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.


శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారుమొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారుఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.


బ్రహ్మోత్సవాలునిత్యకైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.


పుష్పయాగం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.


 కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నగార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులుటెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్ బాబుశ్రీ హరికృష్ణఇతర అధికారులుపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


తిరుమల‌లో భ‌క్తుల‌కు అందుబాటులో విస్తృత వైద్య సేవ‌లు medical services









శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు ప్ర‌తిరోజూ వేలాదిమంది భ‌క్తులు విచ్చేస్తూ ఉంటారు నేప‌థ్యం భ‌క్తు ఆరోగ్య భ‌ద్ర‌త‌పై టీటీడీ ప్ర‌త్యేక దృష్టి పెట్టిందిభ‌క్తుల‌కు వైద్య స‌హాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిమిషాల్లో వైద్యం అందేలా విరివిగా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసింది.


16 వైద్య కేంద్రాల ద్వారా భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు


తిరుమ‌ల‌లో మొత్తం 16 వైద్య కేంద్రాలు భ‌క్తుల‌కు అందుబాటులో న్నాయిఇందులో అశ్వ‌నీ ఆసుప‌త్రి ప్ర‌ధాన వైద్య‌శాల కాగాదీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంట‌ర్ ప‌నిచేస్తోందివీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట‌-6 ఎదురుగావైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ప‌క్క‌న‌క‌ల్యాణ‌క‌ట్ట‌, ఏటీసీ స‌ర్కిల్పీఏసీ-5, శ్రీ‌వారి ఆల‌యంఅలిపిరి న‌డ‌క మార్గంలోని 1500 మెట్టుగాలి గోపురంర‌ద్దీ స‌మ‌యంలో నారాయ‌ణ‌గిరి షెడ్ల‌ వ‌ద్ద ఉన్న వైద్య కేంద్రాల్లో 24X7 భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు అందించ‌బ‌డ‌తాయి.


అదేవిధంగా మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాద కేంద్రంపీఏసీ-2, అలిపిరి పాదాల మండ‌పండో మైలుభాష్య‌కార్ల స‌న్నిధి, ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్న రోజుల్లో శిలాతోర‌ణంసేవా స‌ద‌న్ వ‌ద్ద‌ వైద్య కేంద్రాల్లో ఉద‌యం 8 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు వైద్య సేవ‌లు అందించ‌బ‌డ‌తాయిశ్రీ‌వారి మెట్టులోని 1200 మెట్టు వ‌ద్ద ఉద‌యం 6 నుండి సాయంత్రం గంట‌ల వ‌ర‌కు వైద్య సేవ‌లు అందించ‌బ‌డ‌తాయి.


బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో రామ్ భ‌గీచా-1, పాప‌వినాశ‌నం వ‌ద్ద రెండు అద‌న‌పు వైద్య కేంద్రాల‌ను ర్పాటు చేయ‌డం జ‌రుగుతుందిఅంతే కాకుండా మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ల ద్వారా భక్తుల‌కు వైద్య సేవ‌లు అందించ‌డం జ‌రుగుతోంది.


అందుబాటులో 9 అంబులెన్సులు


భ‌క్తుల‌కు అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు అందించేందుకు తిరుమ‌ల‌లో మొత్తం 9 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయిఇందులో 3 అంబులెన్సులు టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తుండ‌గాఐదు 108 అంబులెన్సులుఒక అపోలో అంబులెన్సు అందుబాటులో న్నాయిఇందులో అశ్వ‌నీ ఆసుప‌త్రి వ‌ద్ద 2 అంబులెన్సులుఒక అపోలో అంబులెన్సులు అందుబాటులో ఉండ‌గావైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వైద్య కేంద్రం ఒక అంబులెన్సుశ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న రామ్ భ‌గీచా విశ్రాంతి గృహం వ‌ద్ద ఒక అంబులెన్సుఏటీసీ వద్ద ఒక అంబులెన్సుఅలిపిరి త‌నిఖీ కేంద్రంరెండో ఘాట్ రోడ్డులోని లింకు రోడ్డుమొద‌టి ఘాట్ రోడ్డులోని 35 మ‌ల‌పు వ‌ద్ద ఒక్కో అంబులెన్సు అందుబాటులో ఉన్నాయిఅత్య‌వ‌స‌ర‌మైన వైద్య స‌హాయం అవ‌స‌ర‌మైన భ‌క్తుల‌ను ముందుగా అశ్వ‌నీ ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తారుమెరుగైన వైద్యం అవ‌ర‌మైన వారిని ఉచితంగా తిరుప‌తిలోని రూయాబ‌ర్డ్‌స్విమ్స్ప్ర‌భుత్వ మెట‌ర్న‌టీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించ‌డం జ‌రుగుతోందివీటికి అద‌నంగా బ్ర‌హ్మోత్స‌వాలుర‌థ స‌ప్త‌మి వేడుక‌ల స‌మ‌యంలో వాహ‌న సేవ‌ల వెనుక ఒక అంబులెన్సునారాయ‌ణగిరి షెడ్ల వ‌ద్ద ఒక అంబులెన్సును అద‌నంగా ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.


128 మంది సిబ్బందితో నిరంత‌రాయంగా వైద్య సేవ‌లు


తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు 8 మంది డాక్ట‌ర్లు, 120 మంది పారా మెడిక‌ల్ సిబ్బందితో నిరంత‌రాయంగా వైద్య సేవ‌లు అందించ‌డం జ‌రుగుతోందితిరుమ‌ల‌లోని అన్ని వైద్య కేంద్రాల్లో రోజుకు స‌గుటున 2400 మంది భ‌క్తులు వైద్య సేవ‌లు పొందుతున్నారు.


అన్ని ర‌కాల వైద్య సేవ‌లు అందుబాటులో


తిరుమ‌ల‌కు వ‌చ్చిన భ‌క్తుల‌కు అన్ని ర‌కాల వైద్య సేవ‌లు అందుబాటులో ఉన్నాయిఅశ్వ‌నీ ఆసుప‌త్రిలో ఈసీజీఎక్స్-రేల్యాబ్నెబ్యూలేష‌న్ఆక్సీజ‌న్డ్రెస్సింగ్ వంటి వివిధ వైద్య స‌దుపాయాల‌తో పాటు మెరుగైన వైద్యం అవ‌స‌ర‌మైన వారిని తిరుప‌తిలోని రూయాబ‌ర్డ్‌స్విమ్స్ప్ర‌భుత్వ మెట‌ర్న‌టీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించ‌డం జ‌రుగుతుంది.

Narayanagiri Gardens Sprufe up for Sri Padmavati Ammavari Parinayotsavams






The Narayanagiri Gardens in Tirumala gear up for the three day annual Sri Padmavati Srinivasa Parinayotsavams from April 25 to 27.


According to the TTD Gardens Wing Deputy Director Sri Srinivasulu  the Parinayotsavam venue is being artistically decorated by nearly 100 floral experts with the concepts of Dashavatara and Ashta Lakshmi Vaibhavam. 


Sri Venkateswara Religious Charitable Trust from Pune has come forward with a contribution of Rs.30 lakh for the grand arrangements at the venue.


During the three day fete, Sri Malayappa Swamy will grace on Gaja Vahanam on the first day, Ashwa Vahanam on the second day and Garuda Vahanam on the final day. 


Meanwhile, His Consorts will reach the venue on special palanquins followed by the celestial Kalyana Mahotsavam which will be conducted in a grand and visually splendid manner.

Ankurarpanam for Sri Konetiraya Swamy Vari Temple Brahmotsavams




Ankurarpanam and Senadhipathi Utsavam were performed on Wednesday evening for the annual Brahmotsavams of Sri Konetiraya Swamy at Keelapatla in Chittoor district.


The Brahmotsavams will be held from April 24 to May 3. All arrangements have been completed.


The festival will begin with Dwajarohanam on April 24 morning. Daily Vahana Sevas will be held from 8 AM to 10 AM and 7 PM to 9 PM.


Kalyanotsavam will be conducted on April 28 evening. Pushpayagam will be held on May 3.


Special spiritual and cultural programmes will be organised daily.


Temple officials participated in the event. Devotees are requested to attend in large numbers.

కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ ఏప్రిల్ 24 నుండి మే 03 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు sri konetiraya




చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవంశాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారుబ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయిచలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యే శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీటెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మోహన రమణ పాల్గొన్నారు.


ఏప్రిల్ 24 ధ్వజారోహణం :


ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 09.05 గం. నుండి 09.15 గం. మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.  శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 24 నుండి మే 03 తేదీ వరకు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారుప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకురాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహనసేవలు భక్తులను అలరించనున్నాయి.

వాహనసేవల వివరాలు:


ఏప్రిల్ 24

ఉదయం – ధ్వజారోహణం (మిథున లగ్నంలో . 9.05 నుండి 9.15 వరకు)

సాయంత్రం – శేష వాహనం


ఏప్రిల్ 25

ఉదయం – తిరుచ్చి ఉత్సవం

సాయంత్రం – హంస వాహనం


ఏప్రిల్ 26

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం


ఏప్రిల్ 27

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం


ఏప్రిల్ 28

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవంగరుడ వాహనం


ఏప్రిల్ 29

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవంగజ వాహనం


ఏప్రిల్ 30

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం


మే 01

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వ వాహనం


మే 02

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం


కల్యాణోత్సవం :


ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారురూ.500/- చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చుపాల్గొనే వారికి ఉత్తరీయంరవికెఅన్నప్రసాదం అందజేస్తారు.


మే 03 సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.


ఆధ్యాత్మిక కార్యక్రమాలు:


 బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుఅన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీతఆధ్యాత్మి కార్యక్రమాలు నిర్వహించబడతాయిభక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.