ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీమతి లత ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు.
అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వాల్మీకేశ్వరస్వామి, శ్రీ మరగతాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తదనంతరం శ్రీ ప్రదోష నంది మండపం వద్ద ఆలయ సంప్రదాయాల ప్రకారం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ శాంతారాం, పలువురు అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments