16.5.25

టిటిడికి రూ.1.40 కోట్లకు పైగా ఎన్నారై భక్తుడి విరాళం

 




అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు.

తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందజేశారు.
విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు,
రూ.1,00,01,116. 
ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు
రూ. 10,01,116, 
ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌కు
రూ.10,01,116, 
ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు,
రూ. 10,01,116, 
ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు
రూ.10,01,116.
టిటిడిలోని వివిధ ట్రస్ట్ లకు విరాళాలు అందించిన దాతను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభినందించారు. 

No comments :
Write comments