హైదరాబాద్ కు చెందిన వారాహి చలన చిత్రం వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత శ్రీ సాయి కూరపాటి ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.

No comments :
Write comments