17.5.25

శ్రీ‌వారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలు విరాళం




తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి శుక్ర‌వారం ఉద‌యం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలక‌త్తాకు చెందిన శ్రీ సంజీవ్ గోయెంకా రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాల‌ను చేయించి స్వామివారికి స‌మ‌ర్పించారు.

ఈ మేర‌కు తిరుమ‌ల‌లోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి ఆభ‌ర‌ణాల‌ను అందజేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, బొక్క‌సం ఇన్ ఛార్జి శ్రీ గురురాజ స్వామి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments