9.5.25

ధ్వ‌జారోహ‌ణంతో ప్రారంభ‌మైన బూర‌గ‌మంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు




చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లం బూర‌గ‌మంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి.

కంకణ భట్టర్ శ్రీ విష్ణుకాంత స్వామి ఆధ్వర్యంలో ఆలయ ధ్వజస్థంభంపై ఉన్న గరుడాళ్వార్ స్వామికి అభిషేకం, ధూప దీప నైవేద్యాల సమర్పణ, దర్భాలంకరణ, ధ్వజపటారోహణ నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 17వ తేదీన సాయంత్రం 5 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర ప్రసాద్, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శ్రీ రాజేశ్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు :
09-05-2025 – సాయంత్రం – శేష వాహనం.
10-05-2025 – సాయంత్రం – హంస వాహనం.
11-05-2025 – సాయంత్రం – హనుమంత వాహనం.
12-05-2025 – సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం.
13-05-2025 – సాయంత్రం – పుష్ప పల్లకి.
14-05-2025 – సాయంత్రం – సింహ వాహనం.
15-05-2025 – సాయంత్రం – అశ్వవాహనం.
16-05-2025 – ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – గజ వాహనం, ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

No comments :
Write comments